Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం దావా కేసు నితిన్ గడ్కరీకి రూ.10 వేల ఫైన్!

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (10:54 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై వేసిన పరువు నష్టం దావా కేసులో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి ఢిల్లీ కోర్టు రూ.10 వేల అపరాధం విధించింది. కోర్టు ఖర్చుల కింద ఈ మొత్తాన్ని చెల్లించాలని ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను సకాలంలో పాటించకపోవడమే ఇందుకు కారణం. 
 
భారత్‌లోని అత్యంత అవినీతిపరుల జాబితాను ఆమ్‌ ఆద్మీ పార్టీ గతంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేరును కూడా చేర్చింది. దీంతో ఆప్‌ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌పై నితిన్‌ గడ్కరీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. 
 
గతంలో ఈ కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్‌ 20వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజుకు మూడు రోజుల ముందే అఫిడవిట్‌ దాఖలు చేయాలని గడ్కరీని ఆదేశించింది. ఆ అఫిడవిట్‌ను అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యాయవాదికి అందించాలని కూడా ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో గడ్కరీ విఫలమై, శనివారమే అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీంతో ఢిల్లీ కోర్టు అపరాధం విధించింది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments