Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎంకే చీఫ్ రాందాస్ అనుచరులు చంపేస్తామని బెదిరిస్తున్నారు : జయ మేనకోడలు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ జయ దీప పేరవై ప్రధాన కార్యదర్శి దీపా జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అదీ కూడా మరో రాజకీయ పార్టీ అధినేత డాక్టర్ రాందాస్ అనుచరగణంపై. పీఎంకే తమిళనాడులో ప్రముఖ పా

Webdunia
సోమవారం, 1 మే 2017 (10:45 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు, ఎంజీఆర్ జయ దీప పేరవై ప్రధాన కార్యదర్శి దీపా జయకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అదీ కూడా మరో రాజకీయ పార్టీ అధినేత డాక్టర్ రాందాస్ అనుచరగణంపై. పీఎంకే తమిళనాడులో ప్రముఖ పార్టీగా ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇదే అంశంపై ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తన మేనత్త దివంగత జయలలిత ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశానేగానీ, అధికారం దాహంతో కాదన్నారు. తనను తొలుత రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకు పలువురు పావులు కదిపారని, అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదని, వారి కుయుక్తులన్నీ అడ్డుకుని, తాను రాజకీయ రంగప్రవేశం చేశానని చెప్పారు. 
 
వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఇప్పుడు తనను హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్‌ అనుచరులు తనకు ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని ఆమె తెలిపారు. రాందాస్ చెబుతున్న 'అవినీతి నిర్మూలన' ప్రకటనలన్నీ భోగస్ అని ఆమె చెప్పారు. కులాల పేరుతో పీఎంకే నేతలు రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనను బెదిరించినా, తన మేనత్త జయలలితను ఆదర్శంగా తీసుకుని రాజకీయ ఒత్తిళ్లను ధైర్యంగా ఎదుర్కొంటానని ఆమె ప్రకటించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments