Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెద్దల సభకు "ఆ ముగ్గురు"... విమర్శలకు ఫుల్‌స్టాఫ్

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (11:34 IST)
భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతల్లో ఓ ముగ్గురుని పెద్దల సభ రాజ్యసభకు పంపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. తద్వారా వీరికి లోక్‌సభ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించకుండా పక్కనబెట్టారన్న విమర్శలకు చెక్ పెట్టాలని వారిద్దరూ భావిస్తున్నారు. 
 
గత సార్వత్రిక ఎన్నికల్లో ఎల్కే అద్వానీ సీటు అయిన గాంధీ నగర్‌ను బీజేపీ చీఫ్ అమిత్ షాకు కేటాయించగా, మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి సీటు అయిన వారణాసిని ప్రధాని నరేంద్ర మోడీ కైవసం చేసుకున్నారు. అద్వానీ, జోషీలకు వయోభారం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో సీట్లు కేటాయించలేదు. 
 
అలాగే, మరో సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ కూడా అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆమెకు కూడా సీటు కేటాయించలేదు. అయితే, ఈ ముగ్గురు సీనియర్లు ఎంతో అనుభవం ఉన్న నేతలు, వీరికి సీట్లు కేటాయించకపోవడంతో పార్టీలోనే కాదు బయటకూడా విమర్శలు చెలరేగాయి. 
 
వీటికి చెక్ పెట్టాలన్న ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఉన్నారు. ఇందులోభాగంగా, ఆ ముగ్గురు నేతలను పెద్దల సభకు నామినేట్ చేయాలన్న భావనలో ఉన్నారు. తద్వారా విమర్శలకు చెక్ పెట్టొచ్చన్నది వారిద్దరి ఆలోచనగా ఉంది. ఇదే విషయంలో ఈ వారంలో జరిగే పార్టీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments