Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం తాగి చనిపోతే బీమా పరిహారం..?

Webdunia
మంగళవారం, 23 మార్చి 2021 (09:15 IST)
మందు బాబులకు ఇది షాకింగ్ న్యూస్. అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సోమవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప ఇతర సందర్భాల్లో పరిహారం ఇవ్వాల్సిన పనిలేదని జస్టిస్‌ ఎం.ఎం. శాంతన్‌గౌండర్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ విషయమై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార సంఘం ఇచ్చిన తీర్పును సమర్థించింది. 
 
సిమ్లా జిల్లాలోని చోపాల్‌ పంచాయతీలో హిమాచల్‌ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న ఓ వ్యక్తి 1997 అక్టోబరు 7-8 తేదీల మధ్య కురిసిన భారీ వర్షాలు, చలి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబసభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే శవ పరీక్ష జరపగా ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, అధికంగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది. 
 
ఇది ప్రమాదం కాకపోవడంతో పరిహారం చెల్లించడానికి బీమా కంపెనీ నిరాకరించింది. కుటుంబ సభ్యులు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. అనంతరం బీమా కంపెనీ జాతీయ ఫోరంను ఆశ్రయించింది. బీమా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అయితే అటవీ సంస్థ మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టుకు అపీలు చేయగా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రెండు సంస్థలకూ లేదని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments