Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెరె.. పెన్షన్ల కోసం భర్తలను చంపేస్తున్నారట.. ఎక్కడ?

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (18:08 IST)
అవును.. పెన్షన్ల కోసం ఉత్తరప్రదేశ్‌లో మహిళలు భర్తలను చంపేస్తున్నారట. ఎలాగంటే..? యూపీలో భర్త ప్రాణాలతో వుండగానే కొందరు మహిళలు వితంతువులకు ఇచ్చే పెన్షన్ తీసుకుంటున్నారు. భర్తలను కోల్పోయిన వితంతువులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో భర్త ప్రాణాలతో వున్నప్పటికీ.. ఆయన మరణించినట్లు చెప్పి.. పెన్షన్లు తీసుకునే మహిళల సంఖ్య పెరిగిపోయిందని తేలింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, సీతాపూర్ జిల్లాకు చెందిన సందీప్ కుమార్ సతీమణి సెల్‌ఫోన్‌కు.. ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఆమె అకౌంట్‌కు మూడు వేల రూపాయలు జమచేసినట్లు వుంది. ఈ మూడు వేలు ఎలా వచ్చిందని ఆరా తీసిన సందీప్ కుమార్.. దీనిపై బ్యాంకు అధికారులను అడిగి తెలుసుకున్నాడు. ఇది వితంతువులకు ఇచ్చే పెన్షన్ డబ్బు అని వారు వివరణ ఇవ్వడంతో షాక్ తిన్నాడు.
 
భర్త తాను ప్రాణాలతో వుండగా వితంతు పెన్షన్ ఎలా వచ్చిందని భార్యను నిలదీశాడు. తర్వాతే తెలిసింది.. సందీప్ భార్యే కాకుండా.. ఆ గ్రామానికి చెందిన 22 మంది మహిళలు.. భర్తలు బతికి వున్నప్పటికీ.. చనిపోయాడని నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి.. పెన్షన్ తీసుకున్నట్లు తేలింది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments