Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుజరాత్‌: పొటాటో చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప!

సెల్వి
బుధవారం, 19 జూన్ 2024 (19:14 IST)
Frog
ఆహార పదార్థాల్లో కల్తీ ఎక్కువవుతుంది. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని పుష్కర్‌ధామ్ సొసైటీ నివాసితులను ఆందోళనకు గురిచేసే షాకింగ్ సంఘటన జరిగింది. చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనబడింది. 
 
పుష్కరధామ్ సొసైటీలోని నివాసముంటున్న జస్మీత్ పటేల్ చిప్స్ ప్యాకెట్ కొనుగోలు చేశారు. సగం తిన్నాక.. జస్మీత్ కూతురు ప్యాకెట్ తెరిచి చూడగా లోపల చనిపోయిన కప్ప కనిపించడంతో నివ్వెరపోయింది. జామ్‌నగర్ మునిసిపల్ కార్పోరేషన్ ఫుడ్ బ్రాంచ్‌‌కు జస్మీత్ పటేల్ ఈ విషయాన్ని తెలియజేశాడు. 
 
వెంటనే స్పందించిన ఫుడ్ బ్రాంచ్ అధికారులు పటేల్ ఇంటికి వెళ్లి ప్యాకెట్‌ను పరిశీలించారు. చనిపోయిన కప్ప చిప్స్ ప్యాకెట్‌లో వుందని నిర్ధారించుకున్న తర్వాత.. ఆ ప్యాకెట్‌ను పరీక్ష కోసం తీసుకెళ్లారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. 
 
ఇకపోతే.. సంబంధిత వేఫర్స్ డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ కేర్ సర్వీస్‌కు ఫిర్యాదు చేయగా సంతృప్తికరమైన సమాధానం రాలేదని, దీంతో బుధవారం ఉదయం ఫుడ్ సేఫ్టీ అధికారికి సమాచారం అందించానని పటేల్ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments