Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పలు తెప్పలుగా మృతి చెందిన గబ్బిలాలు.. కరోనా అని జడుసుకున్న?

Webdunia
బుధవారం, 27 మే 2020 (11:30 IST)
Bats
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కుక్కలు, కాకులు, గబ్బిలాలు చనిపోవటం కరోనా వల్లనే అనే భయాందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా, యూపీలో మరోసారి గబ్బిలాలు గుంపు గుంపుగా చనిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఘోరఖ్ పూర్ సమీపంలో కుప్పలు తెప్పలుగా గబ్బిలాలు చచ్చిపడి ఉన్నాయి. 
 
అసలే కరోనా వైరస్ గబ్బిలాల నుంచే వచ్చిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఘోరఖ్‌పూర్ బేల్‌ఘాట్ గ్రామంలో పెద్ద సంఖ్యలో గబ్బిలాలు చచ్చి పడి ఉండటాన్ని చూసిన స్థానికులు ఇది కరోనా వల్లనే జరిగిందని చెప్పుకుంటున్నారు. 
 
ఈ సమాచారం వెటర్నరీ డాక్టర్లకు తెలియటంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని వాటిని పరిశీలించారు. గబ్బిలాలు చనిపోవటానికి కరోనా వైరస్ కారణం కాదనీ ఈ ప్రాంతంలో ఎండలు బాగా ఉండటం వల్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతోనే గబ్బిలాలు మరణించాయని తెలిపారు.  
 
అటవీ రేంజర్ మాట్లాడుతూ..ఉష్ణోగ్రత పెరగడం..గబ్బిలాలు చనిపోయిన ప్రాంతంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని దీంతో గబ్బిలాలు చనిపోయాయని స్థానికులు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదని సూచించారు. మరణించిన గబ్బిలాలను తదుపరి టెస్టు కోసం ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments