Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువకుడితో పెళ్ళి చేయలేదని.. నిద్రిస్తున్న తల్లిని చంపేసిన కుమార్తె

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (14:35 IST)
కన్నతల్లి అనే కనీస కనికరం కూడా లేకుండా, తనకు అడ్డు తగులుతుందన్న ఆగ్రహంతో ఒక యువతి, అతి క్రూరంగా తన తల్లిని హత్య చేసింది. కర్ణాటకలో కలకలం రేపిన ఈ ఘటన బెంగళూరు కేఆర్ పురంలోని అక్షయనగర్ పరిధిలో జరిగింది. 
 
ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నిర్మల తన కుమారుడు, కుమార్తె అమృతలతో కలిసి అక్షయ నగర్‌లో నివాసం ఉంటోంది. తన తల్లితో నిత్యం గొడవలు పడుతూ ఉండే అమృత, నిన్న జరిగిన వాగ్వాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోగా, అప్పటికే కోపంతో ఉన్న అమృత, కత్తిని తీసుకుని వెళ్లి, తల్లిని దారుణంగా పొడిచి, హత్య చేసి పరారైంది. 
 
దీన్ని చూసిన కుమారుడు కూడా పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలసుకున్న కేఆర్ పురం పోలీసులు, ఘటనా స్థలిని సందర్శించి కేసు నమోదు చేసి, అమృత కోసం గాలిస్తున్నారు. తాను ప్రేమించిన ప్రియుడితో పెళ్లి చేయమని తరచూ తల్లితో అమృత గొడవపడటం అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతోనే హత్య చేసి పరారైనట్లు పోలీసులు విచారణలో తేలింది. నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments