Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో తల్లి రాసలీలలు, చూసిన కుమార్తె తండ్రితో చెప్పడంతో..

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (17:29 IST)
భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు రహస్యంగా ప్రియుడిని ఇంటికి రప్పించుకుని రాసలీలలు సాగిస్తున్న మహిళ అసభ్యకర రీతిలో కూతురి కంటపడింది. చివరికి భర్త చేతిలో హతమైంది. వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
 
వేలూరు సమీపంలోని కమ్మవాన్‌పేటకు చెందిన సెల్వం అనే వ్యక్తికి చిత్రతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు, చిత్ర అదే గ్రామానికి చెందిన మరో యువకునితో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త డ్యూటీకి వెళ్లినప్పుడు ఇంటికి రప్పించి రాసలీలలు సాగించేది. ఈ విషయంపై పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అయినా ప్రవర్తన మార్చుకోని చిత్ర ఆదివారం కూడా భర్త, కూతురు బయటకు వెళ్లినప్పుడు ప్రియుడిని రప్పించుకుంది. 
 
పనిమీద బయటకు వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాగా చిత్ర అసభ్యకర రీతిలో కనిపించింది. తల్లీ కూతుళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సెల్వం డ్యూటీ ముగించుకుని రాత్రి 12 గంటలకు ఇంటికి రాగా కూతురు విషయం మొత్తం తండ్రికి చెప్పింది. దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. సెల్వం పెద్ద కర్ర తీసుకుని భార్య తలపై గట్టిగా కొట్టడంతో రక్తం కారుతూ ఆమె క్రింద పడిపోయింది. చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయగా ఇంటివద్దే ఆమె మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments