Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటానే ఆధునిక యుగపు కొత్త వనరు: ముఖేష్ అంబానీ

నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క పునాది కనెక్టివిటీ మరియు డేటాయేనని, భౌతిక, డిజిటల్, జీవపరమైన అన్ని శాస్త్రాల సమ్మేళనం ఫలితంగానే కనెక్టివిటీ, డేటా సమాజం అందుబాటులోకి వచ్చాయని అంబానీ వివరించారు.

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (02:19 IST)
ఆధునిక యుగానికి కొత్త సహజ వనరు డేటాయే అని రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఈ యుగంలో డేటాను రూపొందించాలంటే అనేకమది ప్రజలు మీ వద్ద ఉండాలని, ఆ రకంగా చూస్తే 120 కోట్లమంది ప్రజలు భారత్‌కు వరంలాంటి వారని ముఖేష్ ప్రశంసించారు.
 
ఒక కొత్త యుగం ఆరంభంలో మనం ఉంటున్నాం. ఈ యుగంలో కొత్త ఇంధనం డేటాయే. భారత్ దేశంలోని యువజనాభా తన నైపుణ్యంతో ప్రపంచం మొత్తం మీద పోటీలో ముందు ఉంటుందని ముఖేష్ తెలిపారు.  టెక్నాలజీ పలు వాణిజ్య కలాపాలపై ఎలాంటి ప్రభావం వేస్తుందో చెప్పడానికి ఆధార్ ఒక పెద్ద ఉదాహరణ అని ముఖేష్ తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క పునాది కనెక్టివిటీ మరియు డేటాయేనని, భౌతిక, డిజిటల్, జీవపరమైన అన్ని శాస్త్రాల సమ్మేళనం ఫలితంగానే కనెక్టివిటీ, డేటా సమాజం అందుబాటులోకి వచ్చాయని అంబానీ వివరించారు.
 
భారతీయ వాణిజ్య నైపుణ్యాలపై తనకు అపార విశ్వాసం ఉందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. యువ భారతీయలు ఒక్కటైన ప్రతి సందర్భంలోనూ మనకు నూతన అవకాశాలు బహుమతిగా వస్తున్నాయని, మన యువత అద్భుత కృషి చేస్తూ అధిక ఫలితాలను సాధిస్తున్నారని ముఖేష్ కొనియాడారు.  
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments