Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటానే ఆధునిక యుగపు కొత్త వనరు: ముఖేష్ అంబానీ

నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క పునాది కనెక్టివిటీ మరియు డేటాయేనని, భౌతిక, డిజిటల్, జీవపరమైన అన్ని శాస్త్రాల సమ్మేళనం ఫలితంగానే కనెక్టివిటీ, డేటా సమాజం అందుబాటులోకి వచ్చాయని అంబానీ వివరించారు.

Webdunia
గురువారం, 16 ఫిబ్రవరి 2017 (02:19 IST)
ఆధునిక యుగానికి కొత్త సహజ వనరు డేటాయే అని రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఈ యుగంలో డేటాను రూపొందించాలంటే అనేకమది ప్రజలు మీ వద్ద ఉండాలని, ఆ రకంగా చూస్తే 120 కోట్లమంది ప్రజలు భారత్‌కు వరంలాంటి వారని ముఖేష్ ప్రశంసించారు.
 
ఒక కొత్త యుగం ఆరంభంలో మనం ఉంటున్నాం. ఈ యుగంలో కొత్త ఇంధనం డేటాయే. భారత్ దేశంలోని యువజనాభా తన నైపుణ్యంతో ప్రపంచం మొత్తం మీద పోటీలో ముందు ఉంటుందని ముఖేష్ తెలిపారు.  టెక్నాలజీ పలు వాణిజ్య కలాపాలపై ఎలాంటి ప్రభావం వేస్తుందో చెప్పడానికి ఆధార్ ఒక పెద్ద ఉదాహరణ అని ముఖేష్ తెలిపారు. నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క పునాది కనెక్టివిటీ మరియు డేటాయేనని, భౌతిక, డిజిటల్, జీవపరమైన అన్ని శాస్త్రాల సమ్మేళనం ఫలితంగానే కనెక్టివిటీ, డేటా సమాజం అందుబాటులోకి వచ్చాయని అంబానీ వివరించారు.
 
భారతీయ వాణిజ్య నైపుణ్యాలపై తనకు అపార విశ్వాసం ఉందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. యువ భారతీయలు ఒక్కటైన ప్రతి సందర్భంలోనూ మనకు నూతన అవకాశాలు బహుమతిగా వస్తున్నాయని, మన యువత అద్భుత కృషి చేస్తూ అధిక ఫలితాలను సాధిస్తున్నారని ముఖేష్ కొనియాడారు.  
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments