Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై దళిత మహిళను చావబాదిన పోలీసు...

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (16:26 IST)
బీహార్‌లో కొత్త సంవత్సరం రోజున ఒక అమానుష ఘటన జరిగింది. నడి రోడ్డుపై దళిత మహిళపై ఓ కానిస్టేబుల్ లాఠీతో విరుచుకుపడ్డాడు. తన వద్ద ఉండే లాఠీతో ఆమెను చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సీతామర్హికి చెందిన ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి బాలికను రక్షించినట్లు వెల్లడించారు. కిడ్నాప్‌ వ్యవహారంలో బాలికకు సంబంధించిన పలువురు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వారిలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పారు. 
 
వారు రోడ్డుపై గొడవకు దిగడంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడిందన్నారు. పోలీసులు వచ్చినా గొడవ ఆపకపోవడంతో వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో లాఠీతో కొట్టినట్లు వివరణ ఇచ్చారు. అయితే.. పోలీసుల చర్యను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
 
మరోవైపు, నడి రోడ్డుపై ఓ దళిత మహిళను పోలీసు లాఠీతో చితకబాదాడు. ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్‌లో నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతుంటే.. సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీని ప్రయోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments