Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడి రోడ్డుపై దళిత మహిళను చావబాదిన పోలీసు...

Webdunia
సోమవారం, 1 జనవరి 2024 (16:26 IST)
బీహార్‌లో కొత్త సంవత్సరం రోజున ఒక అమానుష ఘటన జరిగింది. నడి రోడ్డుపై దళిత మహిళపై ఓ కానిస్టేబుల్ లాఠీతో విరుచుకుపడ్డాడు. తన వద్ద ఉండే లాఠీతో ఆమెను చావబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
సీతామర్హికి చెందిన ఓ బాలిక కిడ్నాప్‌నకు గురైందని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి బాలికను రక్షించినట్లు వెల్లడించారు. కిడ్నాప్‌ వ్యవహారంలో బాలికకు సంబంధించిన పలువురు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వారిలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పారు. 
 
వారు రోడ్డుపై గొడవకు దిగడంతో.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడిందన్నారు. పోలీసులు వచ్చినా గొడవ ఆపకపోవడంతో వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నంలో లాఠీతో కొట్టినట్లు వివరణ ఇచ్చారు. అయితే.. పోలీసుల చర్యను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
 
మరోవైపు, నడి రోడ్డుపై ఓ దళిత మహిళను పోలీసు లాఠీతో చితకబాదాడు. ఈ ఘటనపై ప్రతిపక్ష భాజపా ఆగ్రహం వ్యక్తం చేసింది. బిహార్‌లో నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతుంటే.. సామాన్య ప్రజలపై పోలీసులు లాఠీని ప్రయోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అయితే, ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments