Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత మహిళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (17:12 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ చర్యను వీడియో తీసి బాధితురాలి భర్తకు కూడా పంపించారు. అంతటితో ఆగకుండా ఆ మహిళతో బలవంతంగా బీఫ్ తినిపించారు. ఈ దారుణ ఘటన రాయ్‍బరేలి జిల్లాలో జరిగింది. 
 
ఈ జిల్లాకు చెందిన ఓ దళిత యువతి.. తన ముస్లిం స్నేహితురాలి కొంత డబ్బును అప్పుగా ఇచ్చింది. దాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో సెప్టెంబరు 2వ తేదీన ఒక కేఫ్‌కు రావాలని దళిత యువతికి ముస్లిం స్నేహితురాలు ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె చెప్పిన కేఫ్ వద్దకు దళిత యువతి వెళ్లింది. అప్పటికే తన స్నేహితురాలితో పాటు మరో ఇద్దరు ముస్లిం యువకులు కూడా ఉన్నారు. అందులో ఒకరు బీఫార్మసీ విద్యార్థి షోయబ్ కాగా, మరొకరు బార్బర్‌గా పని చేసే నజీమ్. 
 
వీరంతా కలిసి ఆ యువతిని హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆ యువకులు ఆమెతో బలవంతంగా బీఫ్ తినిపించారు. ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా వీడియో తీసి, దాన్ని ఆమె భర్తకు పంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. పైగా, రూ.5 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేయసాగారు. వారి వేధింపులను భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులందరినీ అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాంధీ తాత చెట్టు అందరి హృదయాలను హత్తుకుంటాయి: పద్మావతి మల్లాది

త్రిష, వినయ్ రాయ్ నటించిన ఐడెంటిటీ తెలుగు ట్రైలర్ లాంచ్

భైరవం టీజర్ ఈవెంట్ లో ఆడిపాడిన అతిధి శంకర్ - పక్కా హిట్ అంటున్న హీరోలు

హత్య ట్రైలర్ రిలీజ్ కాగానే డిస్ట్రిబ్యూటర్లే సినిమాను అడిగారు : దర్శకురాలు శ్రీవిద్యా బసవ

Vijay Ranga Raju: యజ్ఞం విలన్ నటుడు విజయ రంగరాజు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments