Webdunia - Bharat's app for daily news and videos

Install App

దారుణం: కులవివక్ష.. మంచినీరు తాగిన పాపానికి..?

Webdunia
మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (10:47 IST)
దేశంలో ఇంకా కొన్ని చోట్ల కుల వివక్ష కొనసాగుతూనే ఉంది. ఇందుకు నిదర్శనం రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఈ సంఘటనే ఉదాహరణ. అగ్రకులానికి చెందిన ఓ ఉపాధ్యాయుని కోసం ఏర్పాటు చేసిన కుండలోని మంచినీటిని తాగిన పదకొండు మంది దళిత విద్యార్దులను సస్పెండ్ చేశారు.
 
రాజస్థాన్‌లో బికనీర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. బికనీర్‌కు 70 కిమీ దూరంలో ఉన్న తట్ గ్రామంలో ఈ ఘటన సెప్టెంబర్ 1న జరిగితే ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో పనిచేస్తున్న అగ్రకులానికి చెందిన మంగల్ సింగ్ ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారు. తాను తాగటానికి ఉంచుకున్న నీరును ఈ విద్యార్థులు అంటుకోవటంతో కుండ అపవిత్రమైపోయిందని భావించి మంగళ్‌సింగ్ ఈ విద్యార్థులను సస్పెండ్ చేశారు.
 
ఈ విషయం తెలుసుకున్న విద్యార్దుల తల్లిందండ్రులు మంగిలాల్, ప్రకాష్ రామ్ మెగ్వాల్ ఇద్దరూ ఉపాధ్యాయుడి ప్రశ్నించగా... తాను తాగటానికి ఉంచుకున్న నీటిని విద్యార్థులు అంటుకోవటంతో కుండ అపవిత్రమైపోయిందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.
 
ఈ విషయంపై తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆర్తీ డోగ్రా మాట్లాడుతూ స్కూలు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, జిల్లా విద్యాశాఖ అధికారి ఇద్దరిని ఆ గ్రామానికి వెళ్లి డిటేల్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments