Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉచితంగా చికెన్ ఇవ్వలేదని దళితుడిని చెప్పులతో చావగొట్టారు...

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2023 (11:00 IST)
భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు చెందిన ప్రజలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రకాలైన దాడి ఘటనలు వెలుగుచూశాయి. తాజాగా ఓ దళితుడిపై చెప్పులతో చావబాదారు. ఇంతకీ అతను చేసిన నేరం ఏంటంటే.. ఉచితంగా చికెన్ ఇవ్వకపోవడమే. దీంతో అతనిపై చెప్పులతో చావగొట్టారు. ఈ ఘటన లలిత్ పూర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లలిత్‌పూర్ జిల్లాలో ఓ దళిత వ్యక్తి ఊరారా తిరుగుతూ చికెన్ అమ్మే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు యువకులు ఉచితంగా చికెన్ ఇవ్వాలని అడిగ్గా, అందుకు నిరాకరించాడు. దీంతో అతనిపై రోడ్డుపైనే చెప్పులతో చావబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితుడు సుజన్ అహిర్వాన్‌ను నడిరోడ్డుపై చెప్పులతో కొడుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 
 
బైకుపై తిరుగుతూ గ్రామాల్లో చికెన్‌ విక్రయించే అహిర్వార్ వద్ద నిందితులు చికెన్ తీసుకున్నారు. డబ్బులు అడగడంతో ఆగ్రహించిన నిందితులు... అతడిని పట్టుకుని ఈడ్చుకుంటూ చెప్పులతో దాడి చేశారు. తనను వదిలేయాలని ఎంతగానో ప్రాధేయపడినా కనికరం చూపలేదు కదా మరింతగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు... నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments