Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాలూకు రాజ మర్యాద: పప్పు, స్వీట్స్, బాస్మతి బియ్యం అన్నం, కాఫీలిచ్చి?

పశువులకు దాణా కొనుగోలు చేస్తున్నట్లుగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా కోర్టు ప్రకటించింది. దియోగఢ్ ఖజానా నుంచి 1994-96 మధ్యకాలంలో రూ. 84.50 లక్షలు అక్రమ

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (10:42 IST)
పశువులకు దాణా కొనుగోలు చేస్తున్నట్లుగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా కోర్టు ప్రకటించింది. దియోగఢ్ ఖజానా నుంచి 1994-96 మధ్యకాలంలో రూ. 84.50 లక్షలు అక్రమంగా తీసుకున్న కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ సహా 16 మందిని పాట్నాలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తీర్మానించింది. 
 
అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా సహా ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. అయితే దోషులకు జనవరి 3న న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో రాంచీలోని హాత్వార్ జైలులో వీఐపీ ఖైదీగా కాలం గడుపుతున్న లాలూ ప్రసాద్ యాదవ్.. రాజ భోగాలను అనుభవిస్తున్నారని ప్రభాత ఖబర్ అనే జార్ఖండ్ పత్రిక కథనం ప్రచురించింది. ఈ కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనంలో ఏముందంటే.. 
 
దాణా కుంభకోణం కేసులో దోషిగా నిరూపితుడై, శిక్ష కోసం వేచి చూస్తూ, ప్రస్తుతం రాంచీలోని హాత్వార్ జైల్లో వున్న లాలూ ప్రసాద్ అడిగిన వంటకాలను జైలు అధికారులు అందజేస్తున్నారట. ఆయన ఓ ఖైదీగాకన్నా వీఐపీగానే జైల్లో ట్రీట్ చేయబడుతున్నారట. 
 
జైల్లోని పై అంతస్తులో ఉన్న గదిలో ఆయన ఇతర రాజకీయ నాయకులతో కలసి ఉంటున్నారని, కావాల్సినప్పుడల్లా ఆయనకు తినుబండారాలు, కాఫీ తదితర పానీయాలు సమకూరుతున్నాయని తెలుస్తోంది. లాలూకు ఇష్టమైన మొక్కజొన్న, పచ్చి బఠానీ, వంకాయ కూర, తోటకూర, స్వీట్స్, బాస్మతీ బియ్యంతో వండిన అన్నం, పప్పు, సంకట మోచన్ దేవాలయం నుంచి ప్రసాదాన్ని జైలు అధికారులు తెచ్చిస్తున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments