Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను భయపెడుతున్న నిసర్గ తుఫాను.. మహారాష్ట్ర - గుజరాత్‌లకు ముప్పు!

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (21:48 IST)
భారత్‌ను ఇపుడు మరో తుఫాను భయపెడుతోంది. ఈ తుఫానుకు నిసర్గ అని నామకరణం చేశారు. ఈ తుఫాను వల్ల మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
వాస్తవానికి మొన్న బంగాళాఖాతంలో ఎంఫాన్ తుఫాను ఏర్పడింది. ఇది ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అపార ఆస్తి నష్టం సంభవించింది. 
 
ఈ దఫా అరేబియా సముద్రంలో అలజడి రేగింది. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 
 
దీనికి నిసర్గ అని పేరు పెట్టారు. ఇది భారత పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేస్తుందని భావిస్తున్నారు. 'నిసర్గ'కు రుతుపవనాలు కూడా తోడైతే కుంభవృష్టి కురవొచ్చన్న ఐఎండీ అంచనా వేస్తోంది. 
 
ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపైనే ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇది జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాన్ని తాకుతుందని అధికారులు అంచనా వేశారు. 
 
దీని ప్రభావంతో 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో ఆ వేగం 125 కిలోమీటర్లకు చేరవచ్చని వివరించారు. జూన్ 3వ తేదీ నుంచి 24 గంటల పాటు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments