Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌ను భయపెడుతున్న నిసర్గ తుఫాను.. మహారాష్ట్ర - గుజరాత్‌లకు ముప్పు!

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (21:48 IST)
భారత్‌ను ఇపుడు మరో తుఫాను భయపెడుతోంది. ఈ తుఫానుకు నిసర్గ అని నామకరణం చేశారు. ఈ తుఫాను వల్ల మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ముప్పు పొంచివుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
వాస్తవానికి మొన్న బంగాళాఖాతంలో ఎంఫాన్ తుఫాను ఏర్పడింది. ఇది ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అపార ఆస్తి నష్టం సంభవించింది. 
 
ఈ దఫా అరేబియా సముద్రంలో అలజడి రేగింది. ఆదివారం ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారింది. ఇది రాగల 24 గంటల్లో తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. 
 
దీనికి నిసర్గ అని పేరు పెట్టారు. ఇది భారత పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేస్తుందని భావిస్తున్నారు. 'నిసర్గ'కు రుతుపవనాలు కూడా తోడైతే కుంభవృష్టి కురవొచ్చన్న ఐఎండీ అంచనా వేస్తోంది. 
 
ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపైనే ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఇది జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరాన్ని తాకుతుందని అధికారులు అంచనా వేశారు. 
 
దీని ప్రభావంతో 100 కిలోమీటర్లకు పైగా వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో ఆ వేగం 125 కిలోమీటర్లకు చేరవచ్చని వివరించారు. జూన్ 3వ తేదీ నుంచి 24 గంటల పాటు అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments