ఉధంపూర్‌లో సిఆర్‌పిఎఫ్ వాహనం బోల్తా: ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు

ఐవీఆర్
గురువారం, 7 ఆగస్టు 2025 (13:45 IST)
జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక సిఆర్‌పిఎఫ్ వాహనం లోతైన గుంతలో పడి కనీసం ముగ్గురు సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బసంత్‌గఢ్ ప్రాంతంలోని కాండ్వా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారని, గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని ఉధంపూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సందీప్ భట్ తెలిపారు. వాహనం వందల అడుగుల కిందకు పడిపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందులో ఉన్న కొంతమంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
 
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఉధంపూర్ డిసితో మాట్లాడానని, గాయపడిన జవాన్లకు అన్ని విధాలా సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఉదంపూర్ కాండ్వా-బసంత్‌గఢ్ ప్రాంతంలో సిఆర్‌పిఎఫ్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైందనే వార్త విని తాను బాధపడ్డానని జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments