'నేను ఎప్పుడు చనిపోతానని మీరు అడుగుతున్నారు' కదా మై లార్డ్ : రాంజెఠ్మలానీ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ను దేశంలోనే నంబవర్ వన్ క్రిమినల్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన రాంజెఠ్మలాని నిలదీసిన అరుదైన సంఘటన ఒకటి జరిగింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ను దేశంలోనే నంబవర్ వన్ క్రిమినల్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన రాంజెఠ్మలాని నిలదీసిన అరుదైన సంఘటన ఒకటి జరిగింది. ఈయనకు 93 యేళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ ఆయన వాదనల్లో ఏమాత్రం వాడివేడీ తగ్గలేదు. అందుకే సుప్రీంకోర్టులో ఇప్పటికీ ఆయనే నెంబర్ వన్ క్రిమినల్ లాయర్. సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తిని సైతం నిలదీసి ప్రశ్నించే సత్తా ఆయన సొంతం.
ప్రముఖ న్యాయవాది ఎంఎం కశ్యప్ అనే న్యాయవాదిని ఆయన ఛాంబర్ ఖాళీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో దానికి సంబంధించిన కేసును రాంజెఠ్మలానీ వాదిస్తున్నారు. ఈ సందర్భంలోనే మీరెప్పుడు రిటైర్ అవుతున్నారు అంటూ జెఠ్మలానీని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి జెఠ్మలానీ అంతే స్థాయిలో స్పందించి సమాధానం చెప్పడం గమనార్హం.