Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది : సీఎం నితీశ్ కుమార్

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (14:11 IST)
బిహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాదితో పాటు.. ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరగడమే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులతో పాటు.. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ముఖ్యంగా, బీహార్ రాష్ట్రంలో కరోనా మూడో దశ వ్యాప్తి మొదలైందని ఆయన చెప్పారు. బుధవారం ఆయన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 47 కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్టుగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 
 
అయితే పొరుగు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసినా, మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఇంకా లేదన్నారు. ఒకవేళ పాజిటివ్ కేసులు పెరిగితే మాత్రం నైట్ కర్ఫ్యూను అమలు చేసే అంశాన్ని ఆలోచన చేస్తామని తెలిపారు. అలాగే, దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమా మార్కెట్ పడిపోయిందా?

Chiru: ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా చిరంజీవి చిత్రం మన శివశంకరప్రసాద్ పండగకు వస్తున్నారు

Parada Review: అనుపమా పరమేశ్వరన్‌ పరదా మెప్పించిందా లేదా - పరదా రివ్యూ

సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. సీఎం రేవంత్‌కు చిరు థ్యాంక్స్

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు - జనసైన్యాన్ని ఓ రాజువై నడిపించు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments