Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైంది : సీఎం నితీశ్ కుమార్

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (14:11 IST)
బిహార్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాదితో పాటు.. ఢిల్లీలో పాజిటివ్ కేసులు పెరగడమే దీనికి నిదర్శనమని ఆయన చెప్పారు. ఒకవైపు కరోనా పాజిటివ్ కేసులతో పాటు.. మరోవైపు, ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
ముఖ్యంగా, బీహార్ రాష్ట్రంలో కరోనా మూడో దశ వ్యాప్తి మొదలైందని ఆయన చెప్పారు. బుధవారం ఆయన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 47 కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలో థర్డ్ వేవ్ ప్రారంభమైనట్టుగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. 
 
అయితే పొరుగు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేసినా, మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఇంకా లేదన్నారు. ఒకవేళ పాజిటివ్ కేసులు పెరిగితే మాత్రం నైట్ కర్ఫ్యూను అమలు చేసే అంశాన్ని ఆలోచన చేస్తామని తెలిపారు. అలాగే, దేశంలో ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments