Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌ ఐఐటీలో 90మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (11:45 IST)
ఉత్తరాఖండ్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీలో 90 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్‌గా తేలారు. మొన్నటి వరకు 60 మంది విద్యార్థులు వైరస్‌ బారినపడగా.. తాజాగా మరో 30 మంది విద్యార్థులు పాజిటివ్‌గా పరీక్షించినట్లు ఐఐటీ మీడియా సెల్ ఇన్‌చార్జి సోనికా శ్రీవాస్తవ పేర్కొన్నారు. హరిద్వార్ జిల్లా ఆరోగ్య శాఖ కోరల్, కస్తూర్బా, సరోజిని, గోవింద్ భవన్, విజ్ఞన్ కుంజ్ పేరిట ఉన్న ఐదు హాస్టళ్లకు సీల్‌ వేసి, కంటైనర్‌ జోన్లుగా ప్రకటించింది.
 
ఐఐటీ రూర్కీలో సుమారు 3వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 1,200 మంది మంది ఐదు హాస్టళ్లలో ఉంటున్నారు. ప్రస్తుతం విద్యార్థులందరూ హాస్టళ్లలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థులు కరోనా బారినపడుతుండడంతో ఐఐటీకి వచ్చేందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులను తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు రావొద్దని సూచించారు. 
 
ప్రస్తుతం హాస్టళ్లలో ఉన్న విద్యార్థులందరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. ఉత్తరాఖండ్‌లో గురువారం కొత్తగా 787 కొవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments