Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కోరోనిల్' పేరుతో కరోనాకు పతంజలి మందు.. 5 నుంచి 14 రోజుల్లో...?

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (13:00 IST)
corona medicine
'కోరోనిల్' పేరుతో కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు దేశీయ కంపెనీ పతంజలి తెలిపింది. ఈ మందును మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు బాబా రాందేవ్‌ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. 
 
'కరోనిల్' మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. కరోనా వైరస్‌కు మందును తీసుకువస్తున్నామని గతంలోనే పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కోవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.
 
ఈ సందర్భంగా రాందేవ్‌ మాట్లాడుతూ.. 'కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ అన్నారు. 
 
ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చునని చెప్పుకొచ్చారు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకమన్నారు. మందును తీసుకురావడంలో తమ శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయమని రాందేవ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments