Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఢిల్లీలో 6వేలకు తగ్గట్లేదు..

Webdunia
శనివారం, 7 నవంబరు 2020 (10:25 IST)
భారత దేశంలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 50,357 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,62,081కి చేరింది. ఇందులో 78,19,887 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,16,632 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో 577 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో కరోనాతో మరణించినవారి సంఖ్య 1,25,562కి చేరింది. 
 
24 గంటల్లో 53,920 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. శుక్రవారం రోజున 47 వేల కేసులు నమోదు కాగా, శనివారం 50వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ థర్డ్‌ వేవ్ కొనసాగుతోంది. ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా పడిపోవడం, కాలుష్యం పెరిగిపోవడం కూడా పాజిటివ్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 7,178 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో కరోనా వ్యాపించినప్పటి నుంచి అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 
 
గత మూడు రోజుల నుంచి 6 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. నవంబర్ 4వ తేదీన 6,842 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కొవిడ్‌తో 64 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 4,23,831కి చేరగా, రికవరీ రేటు 89 శాతంగా ఉంది.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments