Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్ అడ్డుకునే మందు వచ్చేసింది, మన దేశంలోనే తయారీ

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (20:30 IST)
కరోనా మహమ్మారిని తుదముట్టించే వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న ప్రపంచానికి శుభవార్త! కరోనా వైరస్ చికిత్సకు మందు వచ్చేసింది. ముంబైకి చెందిన భారత ఫార్మా దిగ్గజ కంపెనీ 'గ్లెన్ మార్క్' 'ఫాబిఫ్లూ టాబ్లెట్' కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
 

ఈ సందర్భంగా గ్లెన్ మార్క్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దన్హా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తి చేసిన ఫాబిఫ్లూ బ్రాండ్‌ పేరిట యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్‌ టాబ్లెట్లను  మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

అందుకు అవసరమైన అనుమతులను శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్లు ప్రకటించారు. ఈ డ్రగ్ కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించారు.

ఫ్లూ డ్రగ్ స్థితిగతుల్ని అంచనా వేస్తూ కరోనా వ్యాప్తిని తగ్గిస్తుందని, త్వరలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments