Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో విజృంభిస్తోన్న కరోనా కేసులు.. నైట్ కర్ఫ్యూ.. 12వేల మందికి పైగా మృతి

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (10:41 IST)
కర్ణాటకలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కర్ణాటక రాష్ట్రంలో 6570 కరోనా కేసులు నమోదు కాగా, 2393 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 36 మంది మహమ్మారిన పడి మరణించారు.

కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,40,130 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 9,73,949 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 12,767 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53,395 యాక్టివ్ కేసులున్నాయి.
 
కర్ణాటకలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరుతోపాటు మరో ఆరు నగరాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. వచ్చే శనివారం నుంచి ఈ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని సీఎం తెలిపారు.
 
ముఖ్యమంత్రుల సమావేశంలో కరోనా కట్టడికి అవసరమైతే ఆంక్షలు విధించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన గంటల వ్యవధిలోనే కర్ణాటక ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బెంగళూరుతోపాటు మైసూరు, మంగళూరు, కలబురగి, బీదర్, తమకూరు, మణిపాల్ నగరాల్లో నైన్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం యడ్యూరప్ప తెలిపారు. అత్యవసరాలకు మాత్రమే ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments