Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీజనల్‌ వ్యాధిగా కరోనా?

Webdunia
శుక్రవారం, 19 మార్చి 2021 (10:10 IST)
కరోనా మహమ్మారి కూడా సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలకు సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచదేశాలకు సూచించింది.

కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పుల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై ఐరాస అధ్యయనం చేపట్టింది. కొన్ని వేడి ప్రాంతాల్లోనూ ఈ మహమ్మారి విజఅంభించిందని, వచ్చే ఏడాది ఇలా జరగదు అని చెప్పడానికి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

అత్యంత చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు కరోనా వైరస్‌ ఎక్కువ కాలం మనుగడ సాగిస్తున్నట్లు గుర్తించామని ఐరాస తెలిపింది.

అయితే వైరస్‌ వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపింది.
 
శ్వాసకోశ ఇబ్బందులు, వైరల్‌ ఇన్ఫెక్షన్లు సీజనల్‌గా వస్తుంటాయని నిపుణుల బఅందం వెల్లడించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజఅంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్‌ వ్యాప్తి ఉంటుందని, ఇదే విధంగా కొన్ని సంవత్సరాల పాటు సాగితే కరోనా కూడా సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

మాస్కులు, ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి చర్యల ద్వారా కరోనా వ్యాప్తిని అడ్టుకట్ట వేయగలిగామని తెలిపింది. వాతావరణ అంశాల ఆధారంగా ఆంక్షలను సడలించవద్దని ప్రపంచదేశాలను హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం