Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుబాటులోకి వచ్చిన ట్రాక్.. మళ్లీ పెట్టాలెక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (14:46 IST)
షాలిమార్ - చెన్నై సెంట్రల్ స్టేషన్‌ల మధ్య నడిచే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వెయ్యిమందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదం ఆ మార్గంలో నడిచే అనేక రైళ్లను రద్దు చేశారు. ఆ తర్వాత రైల్వే సిబ్బంది రేయింబవుళ్లు శ్రమించి ప్రమాదం కారణంగా దెబ్బతిన్న రెండు ట్రాక్‌ల నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. 
 
దీంతో మూడు రోజుల తర్వాత చెన్నై - షాలిమార్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు మళ్లీ పట్టాలెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు రైలు బయలుదేరుతున్నట్టు ఎస్ఎంఎస్ సందేశాలు వెళ్లాయి. సోమవారం ఉదయం 10.45 గంటల సమయంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని ఐదో నంబరు ఫ్లాట్‌ఫాంపై నుంచి ఈ రైలు షాలిమార్‌కు బయలుదేరివెళ్లింది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో కూడా షాలిమార్ నుంచి చెన్నైకు మరో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కదిలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments