Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ దుస్సాహసం.. లోక్‌సభ ఎంపీకి తుపాకీ గురి

ఓ కానిస్టేబుల్ దుస్సాహసానికి పాల్పడ్డాడు. కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్ నాథ్‌కు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే ఎంపీ బాడీ గార్డ్స్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (11:11 IST)
ఓ కానిస్టేబుల్ దుస్సాహసానికి పాల్పడ్డాడు. కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ ఎంపీ కమల్ నాథ్‌కు తుపాకీ గురిపెట్టాడు. అప్పటికే ఎంపీ బాడీ గార్డ్స్ అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ విషయలేవీ కమల్ నాథ్‌కు తెలియదు. ఛిన్‌లోని విమానాశ్రయం నుంచి ఢిల్లీకి శుక్రవారం ఆయన వెళ్లిన సందర్భంలో ఈ సంఘటన జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కమల్‌ నాథ్‌ ఢిల్లీకి చార్టెడ్‌ విమానంలో బయలుదేరేందుకు ఛిన్‌ద్వారాలోని విమానాశ్రయానికి శుక్రవారం వచ్చారు. ఈ సమయంలో రత్నేష్‌ పవార్‌ అనే కానిస్టేబుల్‌ అనుమానాస్పదంగా వ్యవహరించాడు. కమల్‌నాథ్‌ విమానం ఎక్కుతుండగా.. పవార్‌ తన సర్వీస్‌ రైఫిల్‌ను ఆయన వైపు గురిపెట్టాడు.
 
దీన్ని గమనించిన ఆయన బాడీగార్డ్స్ అప్రమత్తమై కానిస్టేబుల్‌ను అడ్డుకొని పక్కకు తోసేశారు. ఈ ఘటన నేపథ్యంలో పవార్‌ను సస్పెండ్‌ చేసి విచారణకు ఆదేశించామని ఏఎస్పీ నీరజ్‌ సోనీ వెల్లడించారు. కాగా, తనపై కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్ ఎక్కుపెక్కిన విషయం కమల్ నాథ్ దృష్టికి రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments