Webdunia - Bharat's app for daily news and videos

Install App

మురికితో కూడిన బటన్లు లేని చొక్కా వేసుకున్నాడనీ... మెట్రో రైల్ ఎక్కేందుకు అనుమతించలేదు!!!

వరుణ్
బుధవారం, 10 ఏప్రియల్ 2024 (19:19 IST)
మురికితో కూడిన బటన్లు లేని చొక్కా వేసుకున్నాడనీ ఓ యువకుడిని మెట్రో రైల్ ఎక్కేందుకు అధికారులు అనుమతించలేదు. ఈ ఘటన బెంగుళూరులోని దొడ్డకళ్ళసంద్ర మెట్రో స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. షర్టు బటన్‌ వేసుకుని శుభ్రమైన దుస్తులతో రావాలని, లేకుంటే స్టేషన్‌లోకి వెళ్లనివ్వబోమని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఎంఆర్‌సీఎల్) సిబ్బంది యువకుడిని కోరినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్యకు ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. 'మన మెట్రో ఇలా ఎప్పుడు మారింది?' అంటూ వ్యాఖ్యను జత చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవడంతో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
 
కాగా తాము ప్రయాణికులందరినీ సమానంగా చూస్తామని బీఎంఆర్‌సీఎల్‌ సిబ్బంది తెలిపారు. 'ప్రయాణికులు ధనవంతులా, పేదవారా, పురుషులా, మహిళలా అనే భేదం చూపం. ఆ యువకుడు తాగిన మత్తులో ఉన్నాడని అధికారులు అనుమానించారు. మెట్రోలో మహిళలు, పిల్లలు ప్రయాణిస్తుంటారు. వారి భద్రత మా బాధ్యత. అందుకే వారికి ఇబ్బంది కలగకూడదని అతడిని ఆపాము. కౌన్సిలింగ్‌ ఇచ్చాక మెట్రోలోకి అనుమతించాం' అని ఓ అధికారి తెలిపారు.
 
గతంలో కూడా ఇలాగే బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ ఒక రైతును దుస్తులు మురికిగా ఉన్నాయని మెట్రోలోకి అనుమతించలేదు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవడంతో సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు బీఎంఆర్సీఎల్‌ సిబ్బందిపై నిరసన వ్యక్తంచేశారు. దీంతో అధికారులు మెట్రో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలి: నటి ఖుష్బూ

మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు బాధించాయి : చిరంజీవి

మౌనంగా కూర్చోలేం .. మంత్రి కొండా సురేఖకు జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్

అన్న ప్రాసనరోజే కత్తిపట్టిన శ్రీకళ్యాణ్ కుమార్ - కష్టపడే తత్వం వున్నవాడు : అంజనాదేవి ఇంటర్వ్యూ

పవన్ కళ్యాణ్ కుమార్తెలు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కుటుంబం తిరుమల దేవదేవుడిని దర్శించుకున్న వేళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments