Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూలాలు మరచిపోని ప్రధాని.. మోడీపై ఆజాద్ ప్రశంసల వర్షం

Webdunia
ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (18:10 IST)
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ప్రశంసలు కురిపించారు.. ప్రధాని అయ్యాక కూడా ఆయన  మూలాలు ఎన్నడూ మర్చిపోలేదన్నారు. చిన్నప్పుడు గిన్నెలు తోమానని, టీ అమ్మానని నరేంద్ర మోడీ చాలా సార్లు చెప్పారని ఆజాద్ గుర్తుచేశారు.
 
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన సభలో గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూపై వ్యాఖ్యలు చేశారు. మనం ఏ స్థాయిలో ఉన్నా గతాన్ని మర్చిపోకూడదన్నారు. కాంగ్రెస్ పార్టీలోని లోపాలను ఎత్తిచూపిన ఆజాద్.. ఈ మధ్యే రాజ్యసభ నుంచి పదవీ విరమణ పొందారు.. ఇక, గ్రూప్ -23 నాయకులలో ఒకరైన ఆజాద్.. ఇప్పుడు ప్రధానిపై ప్రశంసలు కురిపించడం చర్చగా మారింది. 
 
విశేషమేమిటంటే, గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ సందర్భంగా ప్రధాని మోడీ ఆయనను రాజ్యసభలో ప్రశంసించారు. ఆయనకు సంబంధించిన ఒక సంఘటనను జ్ఞాపకం చేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు. తర్వాత గులాం నబీ ఆజాద్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక, ఈ ప్రశంసల వెనుక మతలబు ఏంటైనా ఉందా? అనే చర్చ సాగగా... కాశ్మీర్‌లు మంచు ఎప్పుడు నల్లగా కురుస్తుందో అప్పుడు నేను బీజేపీలో చేరతానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments