Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు - మనస్సు మార్చుకున్న శశిథరూర్

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2022 (10:01 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠానికి సోమవారం ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యాయి. ఈ పోటీలో గాంధీ కుటుంబ అండదండలు పుష్కలంగా కలిగిన కర్నాటక కాంగ్రెస్ వృద్ధినేత మల్లికార్జున ఖర్గేతో కేరళకు చెందిన మరో సీనియర్ నేత శశిథరూర్ పోటీపడుతున్నారు. అయితే, ఆయన చివరి నిమిషంలో తన మనస్సు మార్చుకున్నారు. ఈ ఎన్నికల్లో తనకు ఏమాత్రం గెలుపు అవకాశాలు లేవని గ్రహించిన శశి థరూర్.. ఖర్గేతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. 
 
మరోవైపు, 137 యేళ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోనూ, భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ తన ఓటును కర్నాటకలోని బళ్ళారిలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అలాగే, మరో 140 మంది ప్రతినిధులు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రోరల్ కాలేజీలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులతో సహా మొత్తం 9 వేల మంది ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంతో పాటు దేశ వ్యాప్తంగా 65 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

సంబంధిత వార్తలు

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లింబ్ సాల్వేజ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించిన మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

మ్యాంగో జ్యూస్ తాగితే ఇవన్నీ మీ సొంతం

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

తర్వాతి కథనం
Show comments