Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా గాంధీకి వైరల్ ఫీవర్.. శ్రీ గంగా ఆస్పత్రిలో చేరిక.. సుర్జేవాలా

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాందీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె.. అక్కడ ప్రచారరథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (16:05 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాందీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీని ప్రారంభించిన ఆమె.. అక్కడ ప్రచారరథం మీద నుంచి పడిపోవడంతో చేతికి గాయమైంది. అప్పట్లో ఆమెను ఢిల్లీలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చాలా కాలం పాటు ఆమెకు చికిత్స అందించాల్సి వచ్చింది. తాజాగా వైరల్ ఫీవర్ కారణంగా ఆమెను ఢిల్లీ శ్రీ గంగా ఆస్పత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా ప్రకటించారు. 
 
గతంలో కేన్సర్ బారిన పడిన సోనియా గాంధీకి అమెరికాలో చికిత్స అందించారు. గడిచిన మూడు నెలల్లో సోనియా గాంధీని ఆస్పత్రికి తరలించడం ఇది రెండోసారి అని.. రెండు రోజుల పాటు ఆమె గంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతారని సుర్జేవాలా తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన సోనియా గాంధీని భుజం నొప్పి, డీహైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేర్చారు. ఆ సందర్భంగా ఆమెకు చిన్నపాటి శస్త్రచికిత్స కూడా చేశారు. ప్రస్తుతం జ్వరం కారణంగా ఆమె ఆస్పత్రిలో చేరినట్లు సుర్జేవాలా ప్రకటించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments