ఢిల్లీని వీడిన సోనియా గాంధీ .. పనాజీలో మకాం!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (17:14 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలు దేశ రాజధాని ఢిల్లీని వీడారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా.. వైద్యుల సలహా మేరకు ఢిల్లీని వదిలారు. ప్రస్తుతం గోవా రాష్ట్ర రాజధాని పనాజీకి చేరుకున్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీకూడా ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పనాజీకి వచ్చారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా ఇటీవల వైద్యులను సంప్రదించగా కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతంలో గడపాలని సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశ రాజధాని ఢిల్లీని వీడుతున్నట్లు శుక్రవారం ఉదయం ప్రకటించారు. 
 
కొంతకాలంగా సోనియా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తుండటంతో పలువురు శ్వాసకోశ, గొంతు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా కొద్ది రోజులపాటు పనాజీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments