Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీని వీడిన సోనియా గాంధీ .. పనాజీలో మకాం!

Webdunia
శుక్రవారం, 20 నవంబరు 2020 (17:14 IST)
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలు దేశ రాజధాని ఢిల్లీని వీడారు. ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పటికే ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా.. వైద్యుల సలహా మేరకు ఢిల్లీని వదిలారు. ప్రస్తుతం గోవా రాష్ట్ర రాజధాని పనాజీకి చేరుకున్నారు. ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీకూడా ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం పనాజీకి వచ్చారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా ఇటీవల వైద్యులను సంప్రదించగా కాలుష్యం తక్కువగా ఉన్న ప్రాంతంలో గడపాలని సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దేశ రాజధాని ఢిల్లీని వీడుతున్నట్లు శుక్రవారం ఉదయం ప్రకటించారు. 
 
కొంతకాలంగా సోనియా ఛాతి సంబంధ సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తుండటంతో పలువురు శ్వాసకోశ, గొంతు సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో సోనియా కొద్ది రోజులపాటు పనాజీలో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments