ఆశ భయాన్ని ఓడిస్తుంది.. నాడు తండ్రిని కోల్పోయా... నేడు.. : రాహుల్

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (12:00 IST)
Rahul Gandhi
ఆశ భయాన్ని ఓడిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నాడు నా తండ్రిని కోల్పోయాను. నేడు నా దేశాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా లేను అంటూ రాహుల్ గాంధీ అన్నారు. 
 
బుధవారం ఉదయం తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో ఉన్న రాజీవ్‌ గాంధీ స్మారకాన్ని రాహుల్ సందర్శించారు. తొలుత ఈ స్మారకం ప్రాంగణంలో మొక్కను నాటిన రాహుల్‌.. అనంతరం రాజీవ్‌ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించిన తర్వాత ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు. 
 
రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ తన తండ్రి స్మారకాన్ని సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఫొటోను రాహుల్‌ తన ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. 'విద్వేష, విభజన రాజకీయాల కారణంగా నేను నా తండ్రిని కోల్పోయాను. ఇప్పుడు నా దేశాన్ని కూడా కోల్పోవాలనుకోవడం లేదు. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. మనమంతా ఐక్యంగా ఉంటే దేన్నైనా అధిగమించొచ్చు' అని రాహుల్ రాసుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments