Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ వ్యాక్సిన్‌ వికటిస్తే నష్టపరిహారం!

Webdunia
శనివారం, 16 జనవరి 2021 (19:24 IST)
భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్‌కు కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌కు మాత్రమే పరిమిత వినియోగంపై అనుమతులు లభించాయి. కోవిషీల్డ్‌ తీసుకునేవారికి సాధారణంగానే వ్యాక్సిన్‌ వేస్తారు. కానీ, కోవాగ్జిన్‌ తీసుకోవాలంటే మాత్రం అంగీకారపత్రంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది.

షరతులు, నిబంధనలు ఈ పత్రంలో ఉంటాయి. ఒకవేళ కోవాగ్జిన్‌ తీసుకున్న తర్వాత సదరు వ్యక్తిలో ఆరోగ్యపరంగా ఏమైనా ప్రతికూల పరిస్థితులు కనిపించినా.. అందుకు ఆ వ్యాక్సినే కారణమని తేలినా.. సదరు వ్యక్తికి వైద్యఖర్చును భరించడమే కాకుండా నష్టపరిహారాన్ని కూడా భారత్‌ బయోటెక్‌ చెల్లిస్తుంది.

ఈ పరిహారాన్ని ఐసిఎంఆర్‌కు చెందిన సెంట్రల్‌ ఎథిక్స్‌ కమిటీ నిర్ణయిస్తుంది. కోవాగ్జిన్‌ తీసుకున్నవారికి ఓ ఫ్యాక్ట్‌ షీట్‌ను, దుష్ఫలితాలను తెలియజేసే ఓ ఫారాన్ని ఇస్తారు.

వ్యాక్సిన్‌ తీసుకున్న నాటి నుండి ఒక వారం పాటు ఆరోగ్యపరంగా ఎదురైన పరిస్థితులను ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది. జ్వరం, నొప్పి, అలర్జీ, మంట వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడినపుడు ఈ ఫారంలో రాయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments