Webdunia - Bharat's app for daily news and videos

Install App

వృద్ధ జంట సూసైడ్... ఎందుకు?

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (09:44 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ విషాదకర సంఘటన ఒకటి జరిగింది. ఒక్కగానొక్క కుమార్తె మరో కులం వ్యక్తితో లేచిపోయిందనీ... ఓ వృద్ధ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
కోయంబత్తూరు జిల్లా పొల్లాచికి చెందిన ఓ వృద్ధ జంటకు 24 యేళ్ళ ఒకే ఒక్క కుమార్తె ఉంది. ఈమె తన కాలేజీలో చదివే ఓ అబ్బాయిని ప్రేమించింది. అతను వేరే కులానికి చెందిన యువకుడు కావడంతో పెళ్ళికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. పైగా, ఆ యువకుడుని మరిచిపోవాలని సూచించారు. అయినప్పటికీ.. ఆ యువతి ప్రియుడుని మరిచిపోలేక అతనితో కలిసి లేచిపోయి పెళ్లి చేసుకుంది. 
 
ఒక్కగానుఒక్క కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికిలోనయ్యారు. తమ పరువు పోయిందని భావించిన ఆ వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తమ బంధువులకు ఫోన్‌ చేసి చెప్పి ఇద్దరు పురుగుల మందు తాగారు. బంధువులు ఇంటికి వచ్చి చూసే సరికి వారు ప్రాణాలు కోల్పోయి శవాలుగా పడివున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

కన్నడ తమిళం నుంచి పుట్టింది - కమల్ హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

తర్వాతి కథనం
Show comments