Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా భోజనంలో బొద్దింక.. ఎయిర్‌లైన్స్ బొద్దింకలతో కూడిన శాకాహారం ఇస్తుందని?

ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా చికాగో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ ప్యాసింజర్‌కు ఎయిర్ లైన్స్ అందించిన భోజనంలో బొద్దింక ప

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (11:25 IST)
ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు అందించే ఆహారంలో నాణ్యత లోపించింది. ఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా చికాగో వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ ప్యాసింజర్‌కు ఎయిర్ లైన్స్ అందించిన భోజనంలో బొద్దింక ప్రత్యక్షం అయింది. చికాగో వెళుతున్న ఓ ప్రయాణికుడు తనకు ఎయిర్ లైన్స్ సంస్థ అందించిన భోజనంలో బొద్దింక ఉందని దాని ఫోటోలతో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎయిర్ ఇండియా ప్రస్తుతం బొద్దింకలతో కూడిన శాకాహార భోజనం పెడుతుందని.. దీనివల్ల అనారోగ్యం పాలయ్యానని రాహుల్ రఘువంశీ అనే యువకుడు ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ అయ్యింది. 
 
అయితే ఆహారంలో బొద్దింక వ్యవహారం చినికి చినికి గాలివానలా మారకముందే.. ఈ ఘటనతో అసౌకర్యం కలిగిన ప్రయాణికుడికి ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. విమానంలో భోజనం అందించిన కేటరింగ్ సంస్థకు నోటీసు జారీ చేయడంతోపాటు ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని ఎయిర్ లైన్స్ సీనియర్ మేనేజరు ధనుంజయ్ కుమార్ తెలిపారు. దీనిపై తాము బేషరతుగా క్షమాపణలు చెపుతున్నామని.. దీనిపై సరైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments