Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్మోహన్ అభ్యర్థనను మన్నించిన సుప్రీంకోర్టు.. ఊరట...

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:03 IST)
బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేసుకున్న అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మన్నించింది. బొగ్గు స్కామ్‌లో కోర్టుకు హాజరుకావాలంటూ తనకు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన అపెక్స్ కోర్టు.. సీబీఐ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే విధించింది. 
 
బొగ్గు కుంభకోణం వ్యవహారంలో తనకు ప్రమేయం లేదని మాజీ ప్రధాని మన్మోహన్‌ పెట్టుకున్న అభ్యర్థనపై సుప్రీం ఈ విధంగా స్పందించింది. మరో నాలుగు వారాల తర్వాత ఈ కేసుకు సంబంధించిన విచారణను చేపట్టనున్నట్లు సుప్రీం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
 
దీంతో మన్మోహన్‌ సింగ్‌తో పాటు మరో ఐదుగురిపై ఈ కేసులో విచారణను నిలిపివేయాలని సుప్రీం ఆదేశించింది. సీబీఐ కోర్టు జారీ చేసిన సమన్లపై ఉన్నతన్యాయస్థానం స్టే విధించింది.  

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments