Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదు : సీఎం సిద్ధరామయ్య

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. కంప్లి నియోజకవర్గం పరిధిలోని కురుగోడు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభలో సీఎం సిద

Webdunia
గురువారం, 3 మే 2018 (09:14 IST)
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఏ శక్తీ అడ్డుకోలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. కంప్లి నియోజకవర్గం పరిధిలోని కురుగోడు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగసభలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో తమ వంతుగా అన్నివర్గాలకు ఉత్తమ పాలన అందించామన్నారు. రాష్ట్రంలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందుతారన్నారు.
 
రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షాలు ఎన్ని పర్యటనలు చేసినా, ఎలాంటి ప్రయోజనం లేదని, నల్లధనాన్ని వెనక్కు తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదని, నోట్లు బదిలీ, జీఎసీటీ విషయంలో అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడినా పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. రైతులకు రుణమాఫీ తమ వంతుగా చేశామన్నారు. తాము చేసిన అభివృద్ధి పథకాలే ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థుల గెలుపునిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments