Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. హత్య కేసులో బాలుడు అరెస్ట్...!

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (11:48 IST)
తమిళనాడు, వేలూరు జిల్లాలో కేవీ కుప్పంలో బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో అదే పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతనికి సాయం అందించిన మరో విద్యార్థి వద్ద విచారణ చేస్తున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. వేలూరు జిల్లా కేవీ కుప్పం సమీపంలోని కాంగుప్పం గ్రామానికి చెందిన విజయకుమార్ రెండో కుమార్తె కీర్తిక(11) మాచనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. సోమవారం సాయంత్రం కీర్తిక పాఠశాల నుంచి తిరిగి ఇంటికి రాలేదు. కీర్తిక మంగళవారం ఉదయం ముళ్ల పొదల్లో మృతదేహంగా కనిపించింది. పోలీసుల విచారణలో ఆమెపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన విషయం తెలిసింది. 
 
పోలీసులు జరిపిన విచారణలో అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్నశరణ్‌రాజ్ ఘాతుకానికి పాల్పడిన విషయం తెలిసింది. దీంతో పోలీసులు అతని వద్ద విచారణ జరుపుగా.. పాఠశాల నుంచి ఒంటరిగా వస్తున్న కీర్తికను తాను ఆట్లాడుకునేందుకు రమ్మని చెప్పి మామిడి తోటలోకి తీసుకువెళ్లి.. కీర్తిక వద్ద ఆటల పేరుతో ఆమె రిబ్బన్‌తోనే ఆమె చేతులు కట్టేసి, ఆమెపై బలవంతంగా అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి పరారైనట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments