Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీకి వచ్చి బాలికపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 2 నవంబరు 2018 (16:24 IST)
ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన కొందరు దొంగలు.. చివరకు ఆ ఇంట్లో ఉన్న బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో జరిగిన ఈ దాడి వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా కవి సూర్య నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి దొయికొన గ్రామంలోని ఓ ఇంట్లోకి ముగ్గురు దుండగులు బుధవారం అర్థరాత్రి దొంగతనం కోసం వచ్చారు. దొరికిన సొమ్మును ఎత్తుకుపోవటంతోపాటు ఇంట్లో అమ్మ పక్కన నిదురిస్తున్న తొమ్మిదేళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారానికి చేశారు. 
 
గురువారం తెల్లవారుజామున మేల్కొన్న బాలిక తల్లి.. కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెంది.. భర్తను నిద్ర లేపింది. అప్పటికే ఇంట్లోని సామగ్రి చెల్లాచెదురుగా పడి ఉంది. అల్మారాలో దాచిన రూ.20 వేల నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు దంపతులు గుర్తించారు. దొంగతనానికి వచ్చినవారే తమ కుమార్తెనూ ఎత్తుకుపోయి ఉంటారని అనుమానించి, ఇరుగుపొరుగు సాయంతో బాలిక కోసం గాలిస్తుండగా బాధితురాలు ఏడుస్తూ వచ్చింది. 
 
ముగ్గురు ముసుగు దొంగలు తనను ఎత్తుకుని గడ్డివాము చాటుకు తీసుకెళ్తుండగా, మెలకువ వచ్చిందని బాలిక పేర్కొంది. అరిస్తే చంపేస్తామని బెదిరించి దుండగులు అత్యాచారం చేశారని బాధితురాలు బోరున ఏడుస్తూ చెప్పింది. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు... ముసుగు దొంగల కోసంగాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

షారూక్‌ ఖాన్‌ను ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు? నటి ఊర్వశి ప్రశ్న

టాలీవుడ్‌ డైరెక్టర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఉమెన్ సెంట్రిక్ మూవీ

Yogi babu: కొత్త వాళ్లు ఇండస్ట్రీకి రావాలి, అప్పుడే అభివృద్ధి : బ్రహ్మానందం

Producers: సినీ కార్మికుల బెదిరింపులపై నిర్మాతలు కీలక నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం