Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోటో పిచ్చి... పరువు పోగొట్టుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే (వీడియో)

ఫోటో పిచ్చితో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఒకరు తమ పరువు పోగొట్టుకున్నారు. పత్రికల్లో తమ ఫోటోలు కనిపించాలన్న తాపత్రయంతో తమకు తాముగానే పరువు తీసుకున్నారు.

Webdunia
ఆదివారం, 14 జనవరి 2018 (11:16 IST)
ఫోటో పిచ్చితో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే ఒకరు తమ పరువు పోగొట్టుకున్నారు. పత్రికల్లో తమ ఫోటోలు కనిపించాలన్న తాపత్రయంతో తమకు తాముగానే పరువు తీసుకున్నారు. ప్రజా ప్రతినిధులై ఉండి వారు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికార బీజేపీ మహిళా ఎంపీ రేఖా వర్మ, మరో మహిళా ఎమ్మెల్యే కలిసి తమ తమ మద్దతుదారులతో పేదలకు దుప్పట్లు పంచేందుకు సీతాపూర్ ప్రాంతానికి వెళ్లారు. పేదలకు దుప్పట్లు అందించే వేళ, తాను ఫోటోలు దిగుతానంటే, తాను ఫోటోలు దిగాలంటూ ఇద్దరూ గొడవపడ్డారు.
 
చుట్టూ ప్రజలున్నారన్న సంగతిని మరచిపోయారు. మీడియా ఉందన్న విషయమూ వారికి గుర్తుకు రాలేదు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఎమ్మెల్యే మద్దతుదారుడిని ఎంపీ కొట్టగా, ఎంపీ మద్దతుదారుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. వీరి గొడవ గురించి తెలుసుకున్న కలెక్టర్, పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి సర్ది చెప్పి అందరినీ పంపించారు. వీరిద్దరి గొడవ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments