Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ కప్పులో తుఫానులా సుప్రీం వివాదం... జడ్జీల మధ్య సయోధ్య

యావత్ దేశ ప్రజలను దిగ్భ్రమకు గురిచేసిన సుప్రీంకోర్టు వివాదం టీ కప్పులో తుఫానులా సమసిపోనుంది. ఇందుకోసం రాజీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా, ప్రధాన న్యాయమూర్తే ఓ మెట్టుదిగి.. తనపై తిరుగుబాటు జెండా ఎగురవేసి

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (15:13 IST)
యావత్ దేశ ప్రజలను దిగ్భ్రమకు గురిచేసిన సుప్రీంకోర్టు వివాదం టీ కప్పులో తుఫానులా సమసిపోనుంది. ఇందుకోసం రాజీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా, ప్రధాన న్యాయమూర్తే ఓ మెట్టుదిగి.. తనపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో మంగళవారం సమావేశమై చర్చలు జరిపారు. 
 
సుప్రీంకోర్టులో పాలన సరిగా జరగడం లేదంటూ ఈనెల 13వ తేదీన నలుగురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌పై తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. వీరిలో జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకుర్, కురియన్ జోసెఫ్‌లు ఉన్నారు. 
 
నలుగురు జడ్జీల తిరుగుబాటుతో యావత్ దేశం సుప్రీం వ్యవహారశైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వివిధ కేసులపై బెంచ్‌ల ఏర్పాటులో అవకతవకలు జరుగుతున్నాయని నలుగురు సీనియర్ జడ్జీలు ఆరోపించారు.
 
ఈ నేపథ్యంలో నలుగురు జడ్జీలతో మంగళవారం ఉదయం చీఫ్ జస్టిస్ కలిశారు. సీజేఐ చాంబర్‌లో 15 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశ వివరాలు బయటకు వెల్లడికాకపోయినప్పటికీ బుధవారం కూడా మరోమారు భేటీ జరిగే అవకాశాలున్నాయి. అయితే ఐదుగురు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం పాలనకు భంగం జరగకుండా చూడాలని వారంతా నిర్ణయానికి వచ్చేశారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments