Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ కప్పులో తుఫానులా సుప్రీం వివాదం... జడ్జీల మధ్య సయోధ్య

యావత్ దేశ ప్రజలను దిగ్భ్రమకు గురిచేసిన సుప్రీంకోర్టు వివాదం టీ కప్పులో తుఫానులా సమసిపోనుంది. ఇందుకోసం రాజీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా, ప్రధాన న్యాయమూర్తే ఓ మెట్టుదిగి.. తనపై తిరుగుబాటు జెండా ఎగురవేసి

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (15:13 IST)
యావత్ దేశ ప్రజలను దిగ్భ్రమకు గురిచేసిన సుప్రీంకోర్టు వివాదం టీ కప్పులో తుఫానులా సమసిపోనుంది. ఇందుకోసం రాజీ చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా, ప్రధాన న్యాయమూర్తే ఓ మెట్టుదిగి.. తనపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులతో మంగళవారం సమావేశమై చర్చలు జరిపారు. 
 
సుప్రీంకోర్టులో పాలన సరిగా జరగడం లేదంటూ ఈనెల 13వ తేదీన నలుగురు న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌పై తిరుగుబాటు చేసిన విషయం తెల్సిందే. వీరిలో జస్టిస్ చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బీ లోకుర్, కురియన్ జోసెఫ్‌లు ఉన్నారు. 
 
నలుగురు జడ్జీల తిరుగుబాటుతో యావత్ దేశం సుప్రీం వ్యవహారశైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వివిధ కేసులపై బెంచ్‌ల ఏర్పాటులో అవకతవకలు జరుగుతున్నాయని నలుగురు సీనియర్ జడ్జీలు ఆరోపించారు.
 
ఈ నేపథ్యంలో నలుగురు జడ్జీలతో మంగళవారం ఉదయం చీఫ్ జస్టిస్ కలిశారు. సీజేఐ చాంబర్‌లో 15 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ఈ సమావేశ వివరాలు బయటకు వెల్లడికాకపోయినప్పటికీ బుధవారం కూడా మరోమారు భేటీ జరిగే అవకాశాలున్నాయి. అయితే ఐదుగురు న్యాయమూర్తులు ఒకే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం పాలనకు భంగం జరగకుండా చూడాలని వారంతా నిర్ణయానికి వచ్చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments