Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోగులకు వైద్యులు సాంత్వన చేకూర్చాలి : చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

ఠాగూర్
ఆదివారం, 11 ఆగస్టు 2024 (12:00 IST)
రోగులకు వైద్యులు సాంత్వన చేకూర్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కోరారు. పోస్ట్ గ్యాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్స్ (పీజీఐఎస్ఈఆర్) స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన గతంలో సంజయ్ దత్ నటించిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' చిత్రంలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావించారు. రోగులను అర్థం చేసుకునే సున్నిత హృదయం యువ డాక్టర్లకు ఉండాలని ఆయన సూచించారు. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' సినిమాలోని సన్నివేశాలు ఇదే అంశాన్ని ప్రతిఫలిస్తున్నాయని వ్యాఖ్యానించారు. 
 
దేశంలో వైద్య విద్య అభివృద్ధికి పీజీఐఎస్ఈఆర్ గత 62 ఏళ్లల్లో ఎంతో చేసిందని కొనియాడారు. దేశంలో వైద్య రంగం అభ్యున్నతికి పాటుపడాల్సిన బాధ్యత యువ డాక్టర్ల మీద ఉందని అన్నారు. రోగుల సాధకబాధకాలను అర్థం చేసుకుని, సాంత్వన కలిగించాల్సిన బాధ్యత యువ డాక్టర్లపై ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మున్నాభాయ్ సినిమాలోని హీరో ఆత్మీయ ఆలింగనం ఎందరో రోగులకు భరోసా, మనస్సాంతిని కలిగించిన విషయాన్ని గుర్తు చేశారు. పేషెంట్ల బాధలు, మనోభావాలను అర్థం చేసుకోవాల్సిన ఆవస్యకతను ఈ సీన్ ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల నీట్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించిన ఆయన మెడికల్ కాలేజీల్లో ఎంట్రీకి సంబంధించి నైతికత కూడా కీలకమని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

తర్వాతి కథనం
Show comments