Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేతలు చేసిన పనికి సారీ చెపుతున్నా : అశోకగజపతిరాజు

Webdunia
శుక్రవారం, 3 జులై 2015 (11:55 IST)
ఎయిరిండియా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పించేలా బీజేపీ నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన పనులకు తాను క్షమాపణలు చెపుతున్నట్టు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖామంత్రి పూసపాటి అశోకగజపతిరాజు తెలిపారు. 
 
గురువారం విదేశీ పర్యటనకు వెళ్లిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాశ్మీర్ వెళ్లిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్వాకం కారణంగా ఎయిరిండియా విమానాలు సుమారు గంటసేపు ఆలస్యంగా నడిచాయి. ఈ కారణంగా ఈ విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యానికి గురికాగా, పెను చర్చనీయాంశమైంది. 
 
ఈ విషయం తెలుసుకున్న మంత్రి అశోకగజపతిరాజు స్పందించారు. ప్రజల్లోకి వెళ్లిన సమాచారం ప్రకారం చూస్తే, ఈ అంశం ప్రతివాదనకు తావులేనిదన్నారు. మంత్రుల నిర్వాకం వల్ల ఎవరెవరికి ఇబ్బంది కలిగిందో వారందరికీ సంబంధిత శాఖామంత్రిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అసలు జరిగిందేమిటో తెలుసుకుంటామని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments