Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా-పాకిస్థాన్ ఒకటైనాయి.. యుద్ధం వస్తే దాడి ఖాయం.. రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2022 (14:58 IST)
అరుణాచల్ ప్రదేశ్‌లోని దవాంగ్ సెక్టార్‌లో ఇటీవల ఆక్రమణలకు పాల్పడిన చైనా సైనికులను భారత సైనికులు తరిమికొట్టారు. ఈ వివాదం కారణంగా ఇరుదేశాల సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజింగ్‌లో జరిగిన ఒక సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో సుస్థిరతను నిర్ధారించడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి భారత్‌తో కలిసి పని చేయడానికి సిద్ధంగా వున్నట్లు ప్రకటించారు. 
 
ఈ సందర్భంలో, ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, భారతదేశానికి వ్యతిరేకంగా చైనా-పాకిస్తాన్‌లు ఒక్కటయ్యాయని మండిపడ్డారు. యుద్ధం వస్తే కలిసి భారత్‌పై దాడి చేయవచ్చునని కూడా తెలిపారు. సరిహద్దులో ఏం జరిగిందో కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పాలని, మనం ఏ చర్య తీసుకున్నా ఇప్పుడే ప్రారంభించాలని, నిజానికి ఐదేళ్ల క్రితమే చర్యలు తీసుకోవాల్సి ఉందని రాహుల్ అన్నారు. త్వరగా చర్యలు తీసుకోకుంటే దేశానికి ఇబ్బందులు తప్పవని చెప్పుకొచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments