Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్ల బాలికను సజీవంగా పాతిపెట్టిన అమ్మ.. నాన్నమ్మ

Webdunia
బుధవారం, 13 జులై 2022 (08:17 IST)
బీహార్ రాష్ట్రంలోని సారన్ నగరంలో దారుణం జరిగింది. మూడేళ్ళ బాలికను కన్నతల్లితో పాటు నానమ్మలను సజీవింగా శ్మశానంలో పాతిపెట్టారు. ఆ సమయంలో ఆ బాలిక కేకలు విన్న స్థానికులు ఒక్క పరుగున వచ్చిన ఆమెను కాపాడారు. ఈ దారుణం కోపా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మర్హా నది ఒడ్డున ఉన్న శ్మశానవాటికలో మూడేళ్ల బాలికను ఆమె తల్లి, నానమ్మ పాతిపెట్టేశారు. బాధితురాలి ఏడుపులు విన్న మహిళలు దెయ్యం అని భయపడ్డారు. అనంతరం స్థానికులు అక్కడ చేరుకుని మట్టిని తొలగించి చూడగా బాలిక బతికే ఉంది. వెంటనే కోపా పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. 
 
పోలీసులు అక్కడకు చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితురాలు తన పేరు లాలీగా చెప్పింది. తన తండ్రి పేరు రాజు శర్మ, తల్లి పేరు రేఖా దేవీ అని వెల్లడించింది. ఊరు పేరు చెప్పలేకపోయింది. బాలిక కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 'అమ్మ, నానమ్మ బయటకు వెళ్దాం అని తీసుకెళ్లారు. అనంతరం నన్ను శ్మశానం వద్దకు తీసుకెళ్లి నోటిలో మట్టిని నింపి పాతిపెట్టారు' అని బాధితురాలు లాలీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments