Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత ఆరోగ్యం భేష్.. వైద్యానికి స్పందిస్తున్నారు : అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆమె వైద్యానికి స్పందిస్తున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. కాగా

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (17:28 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఆమె వైద్యానికి స్పందిస్తున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్‌ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. కాగా, అనారోగ్యంతో బాధపడుతున్న జయలలిత ఇటీవల వైద్యం కోసం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఈనెల 22వ తేదీన చేరిన విషయం తెల్సిందే. 
 
అయితే, ఆమె ఆరోగ్యంపై వివిధ రకాల పుకార్లు వచ్చాయి. ఇలాంటి పుకార్లు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ తమిళనాడు రాష్ట్ర పోలీసు శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోమారు ఆమె ఆరోగ్యంపై వదంతులు వచ్చాయి. దీంతో అపోలో వైద్యులు ఆరోగ్య బులిటెన్‌ను విడుదల చేశారు. 
 
చెన్నై, గ్రీమ్స్‌‍ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో గౌరవనీయ ముఖ్యమంత్రి జయలలితకు జ్వరం రావడంతో వైద్యం కోసం ఇటీవల చేరారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు అందిస్తున్న వైద్యానికి స్పందిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. అయితే, మరో నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సలహా ఇచ్చారని తెలిపింది. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments