Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (09:56 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. పిల్లలులేని ఓ వ్యక్తి మూఢనమ్మకంతో బతికున్న కోడిపిల్లను మింగడంతో అది కాస్త గొంతులో ఇరుక్కుని పోయింది. దీంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం గమనార్హం.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూరికి చెందిన ఆనంద్ యాదవ్‌కు వివాహమై చాలా ఏళ్లు అయినా సంతానం లేదు. దాంతో పిల్లలు పుట్టే మార్గం చూపమని ఓ తాంత్రికుడిని సంప్రదించాడు.
 
అతడి సూచన మేరకు బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. అది అతడి గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కుప్పకూలాడు. దాంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆనందన్‌ను అంబికాపూర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టంలో అతడి గొంతులో కోడిపిల్లను వైద్యులు గుర్తించారు.
 
ఆనంద్ చనిపోయినా ఆ కోడిపిల్ల బతికే ఉండటం వైద్యులకు షాకిచ్చింది. 20 సెంటీమీటర్ల కోడిపిల్ల గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక ఆనంద్ యాదవ్ చనిపోయినట్లు వైద్యుడు సంతు బాగ్ వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments