Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనర్ అక్కాచెల్లెళ్ళపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 31 జులై 2020 (09:56 IST)
దేశంలో మైనర్ బాలికలకు  కూడా రక్షణ లేకుండా పోతోంది. ఫలితంగా దేశంలో ఎక్కడో చోట వారు అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. తాజాగా మైనర్ అక్కా చెల్లెళ్లపై ఎనిమిది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బలోదాబజార్‌ ప్రాంతంలో ఇద్దరు మైనర్ బాలికలు నివశిస్తున్నారు. వారిద్దరిలో అక్క వయసు 16 సంవత్సరాలు కాగా.. చెల్లెలి వయసు 14 యేళ్ళు. మార్చి 31వ తేదీన వీరిద్దరూ తమ స్నేహితులతో కలిసి ఇంటికి వస్తున్నారు.
 
ఇంతలో అకస్మాత్తుగా దాదాపు 8 మంది యువకులు వారిపై దాడి చేసి మిగతావారందరినీ బెదిరించి తరిమేశారు. అక్కచెల్లెళ్లిద్దరినీ ఎత్తుకెళ్లి వారిపై అత్యాచారం చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టారు. దీంతో వారిద్దరూ నోరు మెదపలేదు. 
 
అయితే రెండు రోజుల క్రితం ఇద్దరిలో ఓ బాధితురాలు మహిళా, శిశు అభ్యున్నతి శాఖను ఆశ్రయించింది. తనపై రెండు నెలల క్రితం కొందరు అత్యాచారం చేశారని, తనతో పాటు తన సోదరిపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయింది. 
 
ప్రస్తుతం వారిలో ఒకరు తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడని, అత్యాచారం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని వాపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం మొత్తం 11 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు కూడా ఉండటం గమనార్హం. వీరందరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments