Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఒత్తిడి... సెలవు ఇవ్వలేదని తుపాకీతో కాల్చుకున్నాడు!

తనకు సెలవు ఇవ్వలేదన్న కారణంతో ఓ కానిస్టేబుల్ తపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ గోపినాథ్ స్వగ్రామం మధురైలోన

Webdunia
ఆదివారం, 25 డిశెంబరు 2016 (16:03 IST)
తనకు సెలవు ఇవ్వలేదన్న కారణంతో ఓ కానిస్టేబుల్ తపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ గోపినాథ్ స్వగ్రామం మధురైలోని వడిపట్టి వాసిగా గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
చెన్నై పరంగిమలైలోని పోలీసు ఆర్మ్ డ్ ఫోర్స్‌స్‌లో గత 2013లో చేరాడు. గోపినాథ్‌ను ట్రైనింగ్ అనంతరం పళని బెటాలియన్‌లో పోస్టింగు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలోని పరంగిమలైకు బదిలీ కావడంతో గోపినాథ్ అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
 
శనివారం పని ఒత్తిడితో అలసిపోయిన గోపినాథ్ రాత్రి తన గదికి వెళ్లి సర్వీస్ రైఫిల్‌తో తలలో కాల్చుకున్నాడు. గన్ ఫైర్ అయిన శబ్దం విన్న మిగిలిన పోలీసులు హుటాహుటిన అక్కడి చేరుకుని అప్పటికే ప్రాణాలు వదిలిన గోపినాథ్‌ను చూశారు.
 
గోపినాథ్ ఆత్మహత్యపై ఆయన సహోద్యోగులను ప్రశ్నించగా.. పెద్ద ఆశలతో అందరూ ఉద్యోగాల్లో చేరినట్లు చెప్పారు. తమపై పని ఒత్తిడి విపరీతంగా ఉంటోందని.. అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments